ఇక్కడ తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారమన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకొన్నవారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలని, తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి, ఆ తరువాత కరుణాకర రెడ్డి అని ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్న ధర్మారెడ్డి .. ఈ ముగ్గురూ తిరుమల లడ్డూ అపవిత్రతకు గురైన అంశంపై సమాధానం చెప్పాలన్నారు. శిక్షలు ఎవరికి, ఎలా పడాలి అనేది విచారణలో తేలుతుంది. ఆపై శిక్షలు అనేవి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చూసుకుంటాడన్నారు.
Home Andhra Pradesh హిందువుల అంతర్గత వ్యవహారం,జగన్ డిక్లరేషన్ అంశం టీటీడీ చూసుకుంటుందన్న పవన్ కళ్యాణ్-pawan kalyan says ttd...