సౌత్ హీరోయిన్ అనిపించుకునే అదృష్టం ఏ కొద్దీ మంది హీరోయిన్లకో వస్తుంది.అలాంటి అరుదైన హీరోయిన్లలో నయన తార(nayanthara)కూడా ఒకటి.గత సంవత్సరం విడుదలైన జవాన్ లో షారుఖ్(sharukh khan)తో జత కట్టి ఇండియన్ హీరోయిన్ గా కూడా గుర్తింపు పొందింది.ఇలా సినిమాల్లోనే కాకుండా వ్యాపార ప్రకటనల్లో కూడా తనదైన హవాని చూపిస్తు ముందుకు దూసుకుపోతుంది.

నయనతార రీసెంట్ గా ఒక వ్యాపార ప్రకటన చేసింది.యాభై సెకన్ల పాటు ఉండే ఆ యాడ్ ఫిలింకి ఐదు కోట్ల రూపాయిల పారితోషకాన్ని అందుకుందనే వార్త  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఒక మూవీలో చేసినందుకు గానే ఐదు కోట్ల రెమ్యునరేషన్ ని అందుకునేది.జవాన్ హిట్ తర్వాత మాత్రమే పది కోట్ల రూపాయలని తీసుకుంటుంది.అలాంటిది ఇప్పుడు కేవలం యాభై సెకన్ల యాడ్ కే ఐదు కోట్ల రూపాయలని తీసుకోవడం అంటే గ్రేట్ అని చెప్పవచ్చు.

 ప్రెజంట్ తన భర్త, దర్శకుడు అయిన విగ్నేష్(vignesh)ఇద్దరు పిల్లతో కలిసి గ్రీస్ వెళ్లగా అక్కడే కొన్ని రోజుల పాటు ఉండనుంది. సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు(manchu vishnu) ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప(kannappa)లో ఒక ముఖ్య పాత్రలో చేస్తుండంతో పాటుగా తమిళంలో మనన్ గట్టి since 1960, మలయాళంలో డియర్ స్టూడెంట్స్ అనే మూవీ చేస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here