జగన్.. అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నావ్..? – సీఎం చంద్రబాబు
“తిరుమల గుడికి వెళ్ళకుండా సాకులు ఎతుక్కున్నాడు. నిన్ను గుడికి వెళ్లొద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చారా ? నీకు దమ్ముంటే, నువ్వు గుడికి వెళ్ళవద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చివుంటే చూపించు. ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నావ్ …? స్వామి వారి గుడికి దళితులు రానివ్వరు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నువ్వు తిరుమల గుడికి వెళ్ళకుండా, నువ్వు సాకులు ఎతుక్కుంటూ, దళితులని లాగుతావ్ ఎందుకు..? మీ పార్టీ జెనెరల్ సెక్రటరీ పొన్నవోలు ఏమంటాడు ? స్వామి వారి ప్రసాదం రాగి, పంది కొవ్వు బంగారం అంటాడా ? కనీసం ఖండించావా జగన్..?” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు.