తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు. ‘‘తితిదే ఎంతో పవిత్రమైందని, నమ్మకం లేనపుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారని జగన్ ని ప్రశ్నించారు. ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు వెళ్తానంటున్నారని నిలదీశారు.