ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో కొందరు వ్యక్తులు చెట్లను ధ్వంసం చేసి ఆక్రమణకు యత్నించారు. జేసీబీ సాయంతో కొంత స్థలాన్ని చదును చేసి వెళ్తుండగా… అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. వెహికిల్ ను సీజ్ క్రమంలో సదరు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.