కూరగంటి మార్క్, పోలేపోగు మేరీ మృతదేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం గ‌న్న‌వ‌రం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని పోలీసులు ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ శివ‌ప్రాద్ తెలిపారు. ఈ ప్రమాదంతో కూర‌గంటి మార్క్ స్వ‌గ్రామ‌మైన‌ ఆరిక‌ట్ల‌వారిపాలెంలోనూ, పోలేపోగు మేరీ స్వ‌గ్రామ‌మైన కొండ‌మంజులూరులోనూ, ప‌ల్లెపోగు ప్రేమ‌మ్మ స్వ‌గ్రామ‌మైన కోట‌పాడులో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. విజ‌య‌వాడ‌, గ‌న్న‌వ‌రం ఆసుప‌త్రులకు కుటుంబ స‌భ్యులు, బంధువులు చేరుకున్నారు. కూర‌గంటి మార్క్‌కు భార్య‌, ఒక బాబు ఉన్నారు. పోలేపోగు మేరీకి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here