ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశం తిరుమల లడ్డు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను అవమాన పరిచేలా తిరుమల లడ్డు కల్తీ జరగడం దురదృష్టకరమని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి ఖుష్‌బూ ఈ విషయంపై ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ ‘తిరుమల లడ్డును కల్తీ చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తిరుమల లడ్డును కల్తీ చెయ్యడమంటే దేశంలోని కోట్ల ప్రజల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీయడమే అవుతుంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఆ వేంకటేశ్వరస్వామి వదిలి పెట్టరు. హిందూ మతాన్ని అవమానించినా, అగౌరవ పరిచినా, చులకనగా చూసినా ఎవరూ సహించవద్దు. లౌకిక వాదం అంటే ప్రతి మతాన్నీ గౌరవించాలి. పక్షపాతంతో వ్యవహరించడం కరెక్ట్‌ కాదు. హిందూ మతాన్ని టార్గెట్‌ చేస్తూ ఇలాంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతున్న వారి విషయంలో మనం ఎందుకు సైలెంట్‌గా ఉండాలి’ అంటూ లడ్బు వ్యవహారంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఖుష్‌బూ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here