శుక్రవారం ఆటకి వరుణుడు పదే పదే అంతరాయం కలిగించాడు. చివరికి కాన్పూర్ స్టేడియం పరిసరాల్లో శుక్రవారం మధ్యాహ్నానికే వెలుతురు సరిగా లేకపోవడంతో తొలి రోజు ఆటను చాలా ముందుగానే అంపైర్లు ముగించారు. దాంతో శనివారం కాన్పూర్‌లో వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు.

భారత్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ టీమ్‌లో ఓపెనర్లు జాకీర్ హసన్ (0), సదామన్ ఇస్లాం (24), కెప్టెన్ శాంటో (31) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఇటీవల చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here