కౌన్సెలింగ్ ఎప్పుడు…?
గతేడాది చూస్తే ఏపీలో లాసెట్ కౌన్సెలింగ్ నవంబర్ మాసంలో ప్రారంభమైంది. కానీ ఈసారి అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏపీ లాసెట్ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఎంట్రెన్స్ లో పాస్ అయిన వారితో పాటు మేనేజ్ మెంట్ కోటాలో చేరాలనుకునే చాలా మంది అభ్యర్థులు… కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.