ఎంఈపీ టన్నుకు 490 డాలర్లు
అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులను అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కానీ, తక్షణమే అమల్లోకి వచ్చేలా టన్నుకు కనీస ఎగుమతి ధర లేదా ఎంఈపీగా (minimum export price) 490 డాలర్లని విధించింది. ఎంఈపీ అనేది ఒక ఉత్పత్తిని విదేశీ కొనుగోలుదారులకు విక్రయించడానికి ఉద్దేశించిన నిర్ణీత కనీస ధర. అంటే, ఈ ధర కన్నా తక్కువ ధరకు ఎగుమతి చేయడానికి వీలు లేదు. అతి తక్కువ ధరలకే భారీగా ఎగుమతులు చేయడాన్ని నిరోధించడానికి ఎంఈపీలను నిర్ణయిస్తారు.