హైడ్రాను బూచిగా చూపించి ప్రజలను భయపెడితే భవిష్యత్ తరాలకు నష్టపోతాయని కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములను ఎవరు కాపాడలేరన్నారు. జన్వాడ ఫామ్హౌస్ 111 జీవో పరిధిలో ఉందని, అది హైడ్రా పరిధిలోకి రాదన్నారు. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న హైడ్రా కమిషనర్, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారన్నారు. N కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే ఉన్న గుడిసెలను తొలగించలేదన్నారు. కొందరు అక్రమ వ్యాపారాలు చేస్తూ… హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారన్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చామని రంగనాథ్ వెల్లడించారు. కొందరు సీరియస్గా తీసుకోలేదని, వారిని ఖాళీ చేయించిన తరువాతనే కూల్చివేతలు స్టార్ట్ చేశామన్నారు.