ఎంఈఓ ను నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైరా సీఐ ఎన్.సాగర్ పాలడుగు చేరుకొని ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను శాంతింపజేసి గదికి వేసిన తాళాన్ని తీయించారు. ఎంఈఓ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న డీఈఓ సోమశేఖర్ శర్మ పాఠశాలకు చేరుకొని అసలు విషయాన్ని విద్యార్థినిల, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఒక దశలో తల్లిదండ్రులు పాఠశాలలోని కుర్చీలు, బల్లలను విరగకొట్టారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకుంటే తాము ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here