ఇతర నేతలపై కూడా..
ఆదర్శ్ అయ్యర్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఇద్దరు సీనియర్ కర్ణాటక బీజేపీ నాయకులు నలీన్ కుమార్ కటీల్, బివై విజయేంద్ర పేర్లు కూడా ఉన్నాయి. అయితే, ఎలక్టోరల్ బాండ్లు విధానపరమైన అంశమని, ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని బీజేపీ వాదిస్తోంది. నిర్మల సీతారామన్ కు మద్దతుగా బీజేపీ (bjp) నేతలు వాదిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్ పథకం ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి బలవంతంగా కోట్లాది రూపాయలు వసూలు చేశారని నిర్మల సీతారామన్, తదితరులపై ఈ ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. ఇందుకు గానూ, ఈడీ దాడులను వాడుకున్నారని ఆరోపించారు.