ఈ విషయాన్ని గీతం యూనివర్సిటీ యాజమాన్యం.. పటాన్చెరు పోలీసులకు, వర్ష తల్లితండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పటాన్ చెరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే వర్ష ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ సమయం లైబ్రరీ లో ఉండేదని స్నేహితులు తెలిపారు. లేదంటే హాస్టల్ రూమ్ కి వచ్చి చదువుకునేదని తెలిపారు. కావున ఆత్మహత్య చేసుకున్న వర్ష చదువు ఒత్తిడితో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.