రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్
మతపరమైన, రద్దీ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పోలీసు సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఆయా జోన్ల పరిధిలో భద్రతా చర్యలను పెంచడంపై దృష్టి సారించాలని ముంబైలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లను ఆదేశించారు. ఉగ్రదాడుల (Terror attack) కుట్ర సమాచారం నేపథ్యంలో నగరంలోని దేవాలయాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా ముందు జాగ్రత్త చర్యగా తెలియజేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆలయల వద్ద భద్రతను పెంచాలని, అన్ని భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షించాలని ముంబై పోలీసులు కోరారని సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ చైర్మన్ సదా సర్వాంకర్ తెలిపారు.