ఈఈకి రూ.12 వేలు.. ఏటీవోకు రూ.2 వేలు..
బంక్ అలాట్మెంట్ అనంతరం సంబంధిత లబ్ధిదారులకు సంస్థకు ఛలానా కట్టడంతో పాటు.. వివిధ శాఖల నుంచి క్లియరెన్స్, ఎన్వోసీలు తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు సంస్థ నుంచి ఎన్వోసీ కోసం వరంగల్ పోలీస్ కమిషనర్కు లెటర్ ఇవ్వగా.. అక్కడి నుంచి రిమార్క్స్ ఏమైనా ఉంటే చెప్పాలని సీపీ.. జనగామ ఆర్ అండ్ బీ ఈఈతో పాటు వరంగల్ వెస్ట్ జోన్ ఏసీపీ, జనగామ డీపీవోకు లెటర్ రాశారు. ఆర్ అండ్ బీ ఈఈ చిలకపాటి హుస్సేన్ ఎన్వోసీ ఇవ్వాల్సి ఉండగా.. అందుకు ఆయన రూ.12 వేల లంచం డిమాండ్ చేశాడు.