అటు ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధురై మీనాక్షి టెంపుల్లో మాజీ మంత్రి రోజా పూజలు చేశారు. ఈ సందర్భంగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ‘చంద్రబాబు ఏ పూజలు చేసినా షూ వేసుకుంటారు. ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేవు. పవన్ భార్య క్రిస్టియన్, పిల్లలు బాప్టిజం తీసుకున్నారు. పవన్ కూడా బాప్టిజం తీసుకున్నానని చెప్పారు. వీళ్లు సనాతనధర్మం గురించి మాట్లాడడం షాకింగ్ గా ఉంది. మేము సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం’ అని రోజా స్పష్టం చేశారు.
Home Andhra Pradesh తిరుమల చుట్టూ రాజకీయం.. జగన్ టార్గెట్గా టీడీపీ నేతల పంచ్లు!-tdp leaders are criticizing jagan...