రైతులకు భారీ హామీ..!
ఝార్ఖండ్లో గత బీజేపీ ప్రభుత్వం రైతులకు ఐదెకరాల వరకు ఎకరాకు ఏటా రూ.5,000 ఇచ్చేదని, కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని పునరుద్ధరిస్తామని, కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రైతులకు ఎకరాకు రూ.5 వేలు ఇస్తామని చౌహాన్ తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల నుంచి క్వింటాలుకు రూ.3,100 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తామని కూడా కేంద్ర మంత్రి తెలిపారు.