(3 / 5)
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం ప్రజలు మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదన్నారు. వాటి మంజూరుకు సంబంధించి త్వరలోనే గ్రామాలు, వార్డుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు..