‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అని అంటారు. కానీ ఈ కాలంలో మనం తింటున్న ఆహారాల్లో పోషకాలు, నాణ్యత ఉండటం లేదు. ఈ పరిస్థితులను మార్చి, ప్రజల్లో అవగాహన నింపి, ఇండియాని ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దేందుకు కొందరు సైలెంట్గా కృషి చేస్తున్నారు. వారిలో ఒకరు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త లక్ష్మీ హరిత. ఏన్షియంట్ ఫుడ్స్ ఇండియా పేరిట తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మిల్లెట్ ఆధారిత, తినడానికి సిద్ధంగా ఉన్న అల్పాహార తయారీలో ప్రత్యేకత కలిగిన సంస్థ ఇది. దోశ మిక్సర్, పొంగల్ మిక్సర్, నమ్కీన్ వంటి భారతీయ సాంప్రదాయ స్నాక్స్ని ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ సెప్టెంబర్ నెలని ‘నేషనల్ న్యూట్రీషియన్ మంత్’గా కేంద్ర గుర్తించిన నేపథ్యంలో లక్ష్మీ హరిత కథను ఇక్కడ తెలుసుకుందాము..