ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణ
లెబనాన్ లోనిహెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. కాగా, హెజ్బొల్లా,ఇజ్రాయెల్ (israel) ఘర్షణ కారణంగా లెబనాన్ లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 2,50,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్లు, అనధికారిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ వివరాలను ఆ దేశ పర్యావరణ మంత్రి నాసర్ యాసిన్ తెలిపారు. నిజానికి ఈ ఘర్షణల కారణంగా నిరాశ్రయులైన వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందన్నారు.