దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చి శనివారం రిమాండ్కు తరలించారు. నిందితుడిని ఉరితీయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాలిక బంధువులు, గ్రామస్థులు ఆందోళన విరమించారు.