కాలేజీకి రూ.2 లక్షల ఫైన్
శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్ను ఫుడ్సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. కిచెన్ లో ఆహార పదార్థాల సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. కాలేజీ కిచెన్, క్యాంటీన్లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. ఫైర్ సేఫ్టీ, ట్రేడ్ లైసెన్స్ లేని కారణంగా రూ. 2లక్షలు జరిమానా విధించారు.