వాష్ రూమ్ కు వెళ్లి..
శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మిహాన్ ప్రాంతంలోని హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ కంపెనీ కార్యాలయంలోని వాష్ రూమ్ లోకి వెళ్లిన సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ ఆ తరువాత సహోద్యోగులకు అపస్మారక స్థితిలో కనిపించాడని సోనేగావ్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. సహోద్యోగులు వెంటనే నాగ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ )కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్ష ఫలితాల్లో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైఖేల్ కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. తీవ్రమైన పని ఒత్తిడి, వేర్వేరు జాబ్ టైమింగ్స్ కారణంగా ఐటీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.