ధర్మపురిలో తొలి విడతగా 980 కేజీల నెయ్యి

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లడ్డూ ప్రత్యేకంగా నిలుస్తోంది. 80 గ్రాముల లడ్డూ ప్రసాదానికి రూ.20, 200 గ్రాముల పులి హోర ప్రసాదానికి రూ.15 తీసుకుంటున్నారు. ప్రతిరోజు సరాసరి 2 వేలు, శని, ఆదివారాలు 3 నుంచి 5 వేల వరకు లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు. దిట్టం సామగ్రిని ఉప ప్రధాన ఆర్చకుడు, సంబంధిత స్టోర్ ఇన్చార్జి, ఈవో ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. 10 కిలోల లడ్డూ ప్రసాదానికి 7 కిలోల నెయ్యి, 20 కిలోల చక్కెర, కాజు 700 గ్రాములు, కిస్మిస్లు 750 గ్రాములు, యాలకులు 100 గ్రాములు, కర్పూరం 10 గ్రాములు, జాజికాయ 10 గ్రాములు, మిస్ట్రీ 500 గ్రాములు వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. 2023 24 సంవత్సరానికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,50,20,00, పులిహోర ప్రసాదం ద్వారా రూ.54,69,750 ఆదాయం సమకూరిందని ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ధర్మపురి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాల విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామని, ప్రస్తుతం కమిషనర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 980 కిలోల విజయ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూ ప్రసాదం తయారు చేసి విక్రయించడం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here