ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై కస్టమర్లకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల పండుగ సీజన్ ప్రారంభమైంది. కేవలం 3 రోజుల్లోనే రూ.26,500 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. డేటా ప్రకారం చాలా మంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించేసరికి జనాలు ఎగబడుతున్నారు.