ఆధార్, బ్యాంకులో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరిచేశారు. దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని, ఆధార్, బ్యాంకులో పేర్ల తప్పుల కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ అవుతాయి.