ఆలస్యంగా వెలుగులోకి..

ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా బేస్త‌వార‌పేట మండ‌లంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బేస్త‌వార‌పేట‌కు చెందిన ఐతా కిషోర్‌కుమార్.. కొత్త మ‌ల్లాపురం ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నారు. చిట్టీలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో ఉపాధ్యాయుల‌ను మోసం చేశారు. గ‌త కొంత‌కాలంగా మెడిక‌ల్ లీవ్ పెట్టి.. భార్య‌, పిల్ల‌ల‌తో పాటు ప‌రార‌య్యాడు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీ మ‌ల్లికాగార్గ్‌కు స్పంద‌న‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ బేస్త‌వారపేట ఎస్ఐని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కిషోర్ కుమార్‌పై చీటింగ్‌, చిట్ ఫండ్ కేసులు న‌మోదు చేశారు. ఆయ‌న కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here