బీఆర్ఎస్ కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చౌకబారుగా, జుగుప్సాకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. రాహుల్ గాంధీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ పార్టీ నాయకుడు ఇలా మాట్లాడుతున్నారని ట్వీట్ చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయాలకు అవమానం అని పేర్కొంది. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించింది.