జై బిహార్ అనండి..
ప్రస్తుతం దేశంలో బిహారీ అన్న పదం ఒక తిట్టులా మారిందని, ఆ పరిస్థితి మారాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ‘‘’మీరంతా ‘జై బిహార్’ అని గట్టిగా నినదించాలి. ఆ నినాదం మిమ్మల్ని, మీ పిల్లలను ఎవరూ ‘బిహారీ’ అని దూషించకుండా చేయాలి. మీ వాయిస్ ఢిల్లీకి చేరాలి. అది బెంగాల్ కు చేరుకోవాలి. అక్కడ బీహార్ కు చెందిన విద్యార్థులను కొట్టారు. బీహారీ పిల్లలను దూషించిన, కొట్టిన తమిళనాడు, ఢిల్లీ, బొంబాయి ప్రాంతాలకు ఇది చేరాలి’’ అని ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) పిలుపునిచ్చారు. బెంగాల్లోని సిలిగురికి పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను వేధించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.