ప్రతి ఇంటిలో లక్ష నుండి పది లక్షల రూపాయలు పైగా నష్టం జరిగిందని, అత్యధికులు సర్వస్వం కోల్పోయారని, చిరు వ్యాపారులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, పరిశ్రమలు పూర్తిగా దెబ్బతినడంతో ఉపాధి లేకుండా పోయిందని వివరించారు. వరద అనంతరం ప్రభుత్వం కొన్ని చర్యలు వేగంగా తీసుకున్నా, దిగువ స్థాయికి సహాయం అందలేదని, ముఖ్యమంత్రి పర్యటించినా స్థానిక కూటమి ప్రజా ప్రతినిధులు పత్తా లేకుండా పోయారని, కూటమి నేతలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here