శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ….

టెక్నాలజీ ఉపయోగించి తెలంగాణ తల్లి విగ్రహం ముసుగును అంటుపెట్టిన యువకుడు అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన కామాద్రి రాంబాబు (34) గా గుర్తించి, అతనిని మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం నిందితున్ని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారించారు. పోలీసుల విచారణలో తానే మద్యం తాగిన మత్తులో సిగరెట్టూ తాగి పీక అక్కడ వేసి వెళ్ళిపోయాను. ఆ పీక అంటుకొని తెలంగాణ తల్లి విగ్రహం ముసుగు కాలిపోయిందని ఒప్పుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here