కొండా సురేఖ వ్యాఖ్యలపై రాంగోపాల్వర్మ స్పందించారు. ‘కన్నులతో చూసి, చెవులతో విన్నట్టు చెప్పడం దారుణం. సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను..తీవ్రంగా ఖండించాలి. కేటీఆర్ను దూషించే క్రమంలో.. సమంత, నాగార్జున ఫ్యామిలీని అవమానించడంలో అర్థమేంటో.. ఆమెకైనా అర్థమైందో లేదో నాకు అర్థమడంలేదు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.