మహిళలతో మాట్లాడిన కోర్టు
పోలీసులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తున్నామని, ఈ కేసును మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ అయినట్టుగా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇద్దరు మహిళలతో మాట్లాడింది. తమ ఇష్టానుసారం ఆశ్రమంలో నివసిస్తున్నామని, అక్కడ తమను ఎవరూ బలవంతంగా అడ్డుకోవడం లేదని కోర్టుకు వారు తెలిపారు. ఆశ్రమంలో ఉండేందుకు ఎలాంటి బలవంతం, ఒత్తిళ్లు లేవని, ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని మహిళలు స్పష్టం చేశారని సుప్రీంకోర్టు వెల్లడించింది. మహిళలు తెలిపిన వివరాల ప్రకారం