హెవీవెయిట్ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ పతనం, మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఘర్షణల కారణంగా ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,264.2 పాయింట్లు క్షీణించి 83,002.09 వద్ద ముగిసింది. నిఫ్టీ 345.3 పాయింట్లు క్షీణించి 25,451.60 వద్ద స్థిరపడింది. అలాగే టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.