మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ అజీజ్నగర్లోని తన ఫామ్హౌస్లో ఏదైనా భూభాగం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్), బఫర్లో ఉంటే కూల్చివేయాలని స్పష్టం చేశారు. తమ కుటుంబం చట్టాన్ని గౌరవిస్తుందని.. ఆక్రమణలుంటే తమ సొంత ఖర్చులతో తొలగించే బాధ్యత తీసుకుంటామని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.