అబూజ్ మఢ్ అడవుల్లో..

ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అబూజ్ మఢ్ (Abujhmad) కు దక్షిణాన ఉన్న తుల్తులి, గెవ్డీ గ్రామాల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నారు. మృతదేహాల కోసం బృందాలు ఇంకా గాలిస్తున్నాయని, మరికొన్ని గంటల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భద్రతా దళాలు ఇంకా అడవిలోనే ఉన్నాయని, ఎన్కౌంటర్ పై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ సంవత్సరం బస్తర్ అడవుల్లో 186 మంది మావోయిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here