PM-KISAN: దేశవ్యాప్తంగా 9.5 కోట్లకు పైగా రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో భాగంగా 18వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో అక్టోబర్ 5, శనివారం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ 18వ విడతలో ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు జమ అవుతాయి. ఈ పథకం కోసం రూ. 20,000 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీనికి ముందు 17వ విడత ఆర్థిక సాయాన్ని 2024 జూన్ 18న పంపిణీ చేయగా, సుమారు 9.25 కోట్ల మంది రైతులకు రూ.2,000 చొప్పున నగదు మొత్తం అందింది. 18వ విడతలో అదనంగా సుమారు 25 లక్షల మంది రైతులు కొత్తగా లబ్ధిదారులుగా మారారు.
Home International PM-KISAN: రేపే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు; ఈ కేవైసీ చేశారా?-18th...