మానవ హక్కుల కార్యకర్తలమని చెప్పి..
కొంధ్వా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి బాధితురాలు, ఆమె స్నేహితుడు బోప్ దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి, తాము మానవ హక్కుల కార్యకర్తలమని చెప్పి, ఈ ప్రాంతానికి జంటలు రాకూడదని వారిని బెదిరించారు. ఆ తరువాత, ఆ యువతి స్నేహితుడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ యువతిని బలవంతంగా కార్లో ఎక్కించుకుని కొంత దూరం తీసుకువెళ్లి, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని చిత్ర హింసలు పెట్టారు. ఆ యువతి శరీరంపై పలు గాయాలున్నాయని పుణె సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.