Siddipet Boy Death: సంపుపై మూత పెట్టకపోవడంతో మూడేళ్ల బాలుడు అందులో పడి మృతి చెందిన ఘటన సిద్ధిపేటలో జరిగింది. కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన బైకని వేణు, రేణుక దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు రుద్రన్ష్ (3) ఉన్నారు. కాగా వేణు ఇంటి ఆవరణలో కొత్తగా సంపూ నిర్మించి, దానిని నీటితో నింపారు. కానీ సంపుపై మూత వేయలేదు. ధోనితో బుధవారం సాయంత్రం బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడ్డాడు.