గతంలో ఆదాయం లేని చిన్న ఆలయానికి రూ.2,500 చొప్పున అందించేవారు. అయితే 2015లో ప్రభుత్వ సాయం రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచారు. అందులో రూ.3,000 అర్చకుడి భృతి కాగా, రూ.2,000 ధూప, దీప, నైవేద్యానికి వినియోగించేవారు. ఆయా ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా ప్రతినెలా అర్చకులకు పడితారం చెల్లించాలి. అయితే ధరలు పెరిగి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ పారితోషికం నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇందులో రూ.7,000 అర్చకుడి భృతి కాగా, రూ.3,000 ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రతినెలా అర్చకుడి ఖాతాలో అన్లైన్ ద్వారా ప్రభుత్వం జమ చేస్తుంది.
Home Andhra Pradesh పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్, ఆ ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాల సాయం రూ.10...