ఉమెన్స్ టీ20 వరల్డ్కప్లో భారత్కి ఆదిలోనే చుక్కెదురైంది. న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్తో దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పేలవ బౌలింగ్, బ్యాటింగ్తో తేలిపోయిన భారత్ ఉమెన్స్ టీమ్ 58 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టోర్నీలో భారత్ జట్టుకి ఇదే తొలి మ్యాచ్కాగా.. ఈ ఒక్క ఓటమితోనే భారత్ సెమీస్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారిపోయాయి.