2020 నుంచి తనపై జానీ మాస్టర్ చాలాసార్లు అనేక ప్రదేశాల్లో లైంగిక దాడి చేశారని ఆయన వద్దే పని చేసే 21ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైట్ చేశారు. తాను మైనర్గా ఉన్నప్పటి నుంచి దురాగతం చేశారని పేర్కొన్నారు. దీంతో జానీపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఇంట్లో, ఔట్డోర్ షూటింగ్ల్లో ఇలా చాలాసార్లు తనపై వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని కూడా పేర్కొన్నారు. ఇక, కేసులు నమోదయ్యాక జానీ పరారయ్యారు. దీంతో సైబరాబాద్ పోలీసులు గోవాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత న్యాయస్థానం రిమాండ్ విధించడటంతో జైలుకు తరలించారు పోలీసులు. విచారణలో తన తప్పును జానీ అంగీకరించారనే సమాచారం కూడా బయటికి వచ్చింది.