ఏపీకి చెందిన బీటెక్ యువకులు……!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన చిలుకురి అరవింద్, తోట జగత్, పెద్దపేటకు చెందిన బందెల శుభనంద్, కృష్ణాజిల్లా నారాయణరావు నగర్ కు చెందిన పోలిశెట్టి తేజసాయిబాబు, కోటరెడ్డిపేటకు చెందిన జొన్నలగడ్డ మహేష్ బాబు లు బీటెక్ చదివి హైదరాబాద్ లో కలిసి ఉంటున్నారు. పురాతన విగ్రహాలను విక్రయించడం ద్వారా సులభంగా అధిక డబ్బులు సంపాదించవచ్చని యూట్యూబ్ లో తెలుసుకున్నారు. ఈజీ మనీ సంపాదించాలనే దురాశతో గూగుల్, యూట్యూబ్లో ఆదరణ లేకుడా ఉన్న పురాతన దేవాలయాలు, విగ్రహాల గురించి వెతికారు.