ఇటీవలె హైడ్రా హీరో నాగార్జున భాగస్వామిగా ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. నాగార్జున కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా కూల్చివేసింది. ఈ విషయంపై ప్రభుత్వంపై హీరో నాగార్జున కాస్త అసహనంతో ఉన్నారు. ఇంతలో మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జునను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో… ఆయన వెంటనే స్పందించారు. తనకు నష్టం కలిగేలా మాట్లాడారని, కోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.