శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా చెఱకుగడ, విల్లు, పాశాంకుశలను ధరించి ఎరుపు, నీలం రంగు చీరల్లో దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారికి రాజభోగం పేరుతో పాయసాన్నం, చక్రాన్నం, పూర్ణాలు, అల్లంగారెలు ఇలా పది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకోడానికి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడ తరలి వస్తున్నారు.
Home Andhra Pradesh శ్రీచక్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీదేవి, దేవీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి-indrakiladri resounding with...