ఈ శక్తులతో భూమిని, ప్రజలను, సన్యాసులను బాధిస్తూ ప్రారంభించాడు. భీముని చంపడానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. భీముడు, శివుడి మధ్య మహా యుద్ధం జరిగింది. చివరకు భీముడిని సంహరించిన శివుడు, ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో పుట్టుకొందాడు. ఈ జ్యోతిర్లింగమే భీమాశంకరంగా ప్రసిద్ధి చెందింది. భీమాశంకర ఆలయం పర్వతశ్రేణుల మధ్యలో ఉండి, సహజసిద్ధమైన అందాలను ఆస్వాదించేలా ఉంటుంది. ఆలయం దక్షిణ భారత శైలిలో నిర్మించబడింది. ప్రధాన గర్భగృహంలో భీమాశంకర స్వామి జ్యోతిర్లింగంగా కొలువై ఉంటాడు. ఇక్కడి జలపాతం, నదులు, పర్వతాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.