ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి దేవ్ భూమి ఉత్తరాఖండ్ కు ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ, ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ సంయుక్తంగా దేశంలోని ప్రముఖ ప్రదేశాలు, ఆలయాలను కవర్ చేస్తూ “భారత్ గౌరవ్ మానస్ఖాండ్ ఎక్స్ప్రెస్ ద్వారా దేవ్ భూమి ఉత్తరాఖండ్ యాత్ర” ప్రారంభించింది.