ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు జాతీయ చలన చిత్ర అవార్డు నిలిచిపోయింది. తిరుచిత్రాబళం సినిమాలో మేఘం కరుగత పాటకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డుకు జానీ ఎంపికయ్యారు. 2022కు గాను 70వ జాతీయ అవార్డుల్లో జానీకి పురస్కారాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటించింది. అయితే, తన వద్ద పని చేసిన కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై జానీ మాస్టర్ గత నెలలో జైలు పాలయ్యారు. పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ తరుణంలో ఆయన జాతీయ అవార్డు రద్దయింది. దీనిపై కొందరు స్పందిస్తున్నారు.
Home Entertainment Jani Master: జానీ మాస్టర్కు సపోర్ట్ ఇచ్చిన కొరియోగ్రాఫర్.. “అవార్డు ఇవ్వాలి.. సర్వనాశనం చేయడం తప్పు”