‘మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం. బఫర్జోన్లో ఇళ్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తాం. ఫాంహౌస్లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారు. ప్రత్యామ్నాయం అడిగితే చెప్పరు. చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతాయి. గత ఎండాకాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. చెరువులు, నాలాలు పోయి, చివరకు మూసీ కూడా పోతే నగరం ఎలా వరద భరిస్తుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.